ఈ రెండు జిల్లాల గుండా మహారాష్ట్ర లోని ప్రజలు రాకపోకలు జరుపుతుంటారు . దాంతో తెలంగాణ విద్యారోగ్య శాఖ ఈ రెండు జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది . జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు స్క్రీనింగ్ చేయాలని పేర్కొంది . అయితే మహారాష్ట్ర నుండి బైక్ పై, ఇతర వాహనాల్లో వస్తున్న ప్రయనికులకు చెక్ పోస్ట్ ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నవాళ్లు, జలుబు దగ్గు ఉన్నవాళ్ళని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ బస్సులు రైళ్లలో వస్తున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడం లేదు. దాంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో నిజామాబాద్ కు ఎక్కువ మంది ప్రయాణికులు వస్తుంటారు. దాంతో స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ రెండు జిల్లాల గుండా మహారాష్ట్ర లోని ప్రజలు రాకపోకలు జరుపుతుంటారు . దాంతో తెలంగాణ విద్యారోగ్య శాఖ ఈ రెండు జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది . జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు స్క్రీనింగ్ చేయాలని పేర్కొంది . అయితే మహారాష్ట్ర నుండి బైక్ పై, ఇతర వాహనాల్లో వస్తున్న ప్రయనికులకు చెక్ పోస్ట్ ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నవాళ్లు, జలుబు దగ్గు ఉన్నవాళ్ళని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ బస్సులు రైళ్లలో వస్తున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడం లేదు. దాంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో నిజామాబాద్ కు ఎక్కువ మంది ప్రయాణికులు వస్తుంటారు. దాంతో స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.