ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలతో ఎంతోమంది విలువైన ప్రాణాలను ఆత్మహత్యల పేరుతో తీసుకుంటున్న  ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్నాయి అన్న  విషయం తెలిసిందే. ఎంతో  ధైర్యం గా ఉండాల్సిన మనుషులు  చిన్న కారణాలకి ఇక జీవితం మొత్తం వృధా అయిపోయింది అని మనస్తాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన వారు చిన్న  సమస్యలకు భయపడి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్యకాలంలో కోకొల్లలుగా తెర మీదికి వస్తూ ఉన్నాయి అనే విషయం తెలిసిందే.



 అయితే క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటున్న ఎంతో మంది కుటుంబాలు తీరని విషాదాన్ని నింపుతున్నారు.  అయితే ఈ మధ్య కాలంలో ఎంతోమంది చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఇక ఏకంగా వీడియో కాల్ చేస్తూ మరి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కొన్ని తెరమీదికి వస్తున్నాయి  అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఈ జీవితం వృధా అనుకున్నాడు యువకుడు.. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.



 నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో చోటు చేసుకుంది ఈ విషాదకర ఘటన. కమ్మరి ప్రవీణ్ అనే 25 ఏళ్ల యువకుడు పొలం వద్ద గుడిసెలో ఉరి  వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ప్రవీణ్ ఇటీవలే దుబాయ్ నుండి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇక ఇంటికి వచ్చినప్పటి  నుంచి దిగాలు  గానే  కనిపించాడు. ఇక ఇటీవలే పొలం వద్ద ఉన్న గుడిసె  లోకి వెళ్లి అక్కడ వీడియో కాల్ చేస్తూ మరి ఉరి వేసుకున్నాడు. స్థానికులు అప్రమత్తమై అక్కడికి చేరుకునేలోపే ప్రవీణ్ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: