అయితే అప్పటి నుండి ఏపీ ప్రభుత్వం నుండి ఖచ్చితమైన జీవో మాత్రం ఇచ్చింది లేదు. ఈ విషయంపై ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో చిరంజీవి పలు సార్లు మాట్లాడినా ఎందుకు ఇంకా జీవో ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ఎందుకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఏపీ ప్రభుత్వానికి అంత పట్టదు అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇకపై తెలుగు సినిమా కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని తెలుగు సినిమాలను ఏపీలో విడుదల చేయకుండా నిర్ణయం తీసుకోవాలని నాగబాబు అన్నారు.
అయితే ఇలా చేయడం వలన సినిమా పరిశ్రమకు నష్టం ఏమీ ఉండదని మేము ఎలాగూ ఓటిటి మరియు డిజిటల్ మీడియా ద్వారా మాకు రావాల్సిన డబ్బును రాబట్టుకుంటాము అంటూ ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించాడు. ఏపీ చెబుతున్నట్లుగా సినిమాలను తక్కువ ధరలకు చూపించాలి అనుకుంటే? ఒక్క తెలుగు సినిమానే కాదు... హాలీవుడ్ సినిమాలను కూడా 10 రూపాయలకే చూపించండి అంటూ సవాల్ విసిరారు. ఇదంతా కూడా తెలుగు సినిమా పరిశ్రమను దెబ్బ కొట్టాలని చేస్తున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు అసలుకే మోసం తెస్తాయా అని పలువురు ఆలోచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి