ఎండు మిర్చికి రికార్డు ధర ?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి అనేది ఎర్రబంగారంగా మారింది. ఎంతో విలువైన బంగారంతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి ఎండు మిర్చి ధరలు.ఇక మార్కెట్‌కు కూడా సరుకు కాస్త తక్కువగా వస్తూ ఉండటంతో మిర్చి డిమాండ్ అనేది ఆకాశాన్ని తాకి అమాంతం పెరిగింది.ఇక కర్నూలు మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మిర్చికి అయితే షాక్ అయ్యే రికార్డు రేటు దక్కింది.క్వింటా ధర వచ్చి ఏకంగా రూ.48,299 పలికింది.తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం కోనేరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు పంట రికార్డు రేటుకు అమ్ముడయ్యింది. ఆయన మంగళవారం నాడు 3.62 క్వింటాళ్ల ఎండుమిర్చిని కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకురావడం జరిగింది.ఇంకా అంతేగాక అది బ్యాడిగ రకం అవ్వడం.. ఆ సరుకు క్వాలిటీ కూడా సూపర్‌గా ఉండటంతో..అక్కడున్న వ్యాపారులు మంచి ఆసక్తి కనబరిచారు. 


ఈ క్రమంలోనే దాన్ని ఏకంగా రికార్డు స్థాయిలో క్వింటా రూ.48,299కు కొనుగోలు చేశారు. కర్నూలు మార్కెట్‌లో ఇప్పటి దాకా ఇదే హై రేటు అని అధికారులు తెలిపారు. గత సంవత్సరం మిర్చి రైతును నల్ల తామర ఇబ్బంది పెట్టింది. కనీసం పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా వారికి అసలు తిరిగి రాలేదు. దీంతో అధిక దిగుబడులు ఇంకా అలాగే తెగుళ్లను తట్టుకునే రకాలపై రైతులు చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంతేగాక నల్ల తామర నివారణకు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో చీడపీడల సమస్య కూడా తగ్గింది.ఇక దీనికి మంచి ధర కూడా ఉండటంతో రైతులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ధర ఇంకాస్త పెరుగుతుందేమో అని కొంతమంది రైతులు పంటను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకుంటున్నారు.ఆ పంట తక్కువగా ఉండటంతో.. ధర మున్ముందు మరింత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: