నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చేసే తొలిసంతకంపై చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయితే   చేసే పనులపై ఇప్పటికే పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పాటు.. ఇంకా పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు. అలాగే ఐటీ స్థానంలో ఏఐ ప్రస్థావన కూడా లేవనెత్తారు.ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీ పై చేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు.


ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... "మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇస్తున్నా.. కూటమి అధికారంలొకి రాగానే తొలిరోజే, తొలి సంతకం డీఎస్సీపై చేస్తా.. అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుందని తనదైన స్టైల్లో హామీ ఇచ్చారు. ఇక యువత వెళ్లి.. "ఇప్పుడు డీఎస్సీ వద్దు, ఎన్నికలు అయ్యాక జరిపించండి" అని ఎన్నికల సంఘాన్ని కోరమని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తాము కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి డీఎస్సీపై మాట్లాడతామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకేసారి ఏకంగా మెగా డీఎస్సీనే జరుపుతామని బాబు తెలిపారు. ప్రస్తుతం ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని.. కేవలం వాలంటీర్ల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని అన్నారు.ఇదే సమయంలో వాలంటీర్ల ప్రస్థావన తెచ్చిన చంద్రబాబు నాయుడు ఆ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలు తీయమని, పైగా మెరుగైన జీతాలు ఇస్తామని ప్రకటించారు.ఇంజినీరింగ్ పూర్తిచేసి వాలంటీర్లుగా పనిచేస్తున్నవారంతా కూడా బయటకు రావాలని.. స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా వారికి శిక్షణ ఇచ్చి ఇంటి నుంచే రూ. 30 వేల నుంచి 50 వేల దాకా సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు నాయుడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: