
టిడిపి పార్టీ పైన ఫుల్ ఫైర్ అవుతూ రాష్ట్రంలో ధన ఉన్మాదం అధికార మేలుతోంది అంటూ ఆరోపణలు చేశారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు కూడా అన్నిచోట్ల అవినీతి జరుగుతోందన్నట్లుగా ఆరోపణలు చేశారు. ఈ అవినీతినీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినా కూడా ప్రయోజనం లేదంటూ అందుకే తాను టిడిపి పార్టీకి రాజీనామా చేశానంటూ తెలియజేశారు. సుమారుగా 40 ఏళ్ళు పాటు టిడిపిలో కొనసాగిన సుగవాసి కుటుంబం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వైసిపి పార్టీకి రాజంపేట చాలా కీలకంగా మారిందంటూ సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు. టిడిపిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను తాను సహించలేక టిడిపి పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చానని తెలియజేశారు. ఇలా వైసిపి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో కొంతమంది టిడిపి నేతలు పైన పలు ఆరోపణలు చేశారు.. ఇసుక, మట్టి మాఫియా తో టిడిపి నేతలు చాలా దోచుకుంటున్నారనే విధంగా ఆరోపణలు చేశారు. దీంతో అటు సుగవాసి ఆరోపణలతో రాయచోటి, రాజంపేట నియోజకవర్గలలో కొంతమేరకు ఉలిక్కిపాటికి గురి చేసినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి టిడిపి పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరెవరెవరు పార్టీని వీడుతారో చూడాలి.