
అయితే చంద్రబాబు చెబుతున్న మాట ప్రకారం తొమ్మిది లక్షల కోట్ల మేరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని, అనేక కంపెనీలు వస్తున్నాయని భవిష్యత్తు అంతా బాగుంటుందని భరోసా ఇస్తున్నారు .. అయితే దీన్ని టిడిపి నాయకులు ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు .. వచ్చే నెల రెండు తారీకు నుంచి టిడిపి నాయకుల అభివృద్ధి , సంక్షేమం పై ఇంటింటికి తిరిగి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించనున్నారు .. అయితే ఇదంతా బాగానే ఉంది .. అయితే అసలు చంద్రబాబు విశ్వరూపం ఇప్పుడు కాదు 2029 ఎన్నికలకు ముందు కనిపిస్తుంది అనేది ఓ సీనియర్ నాయకుడు అంటున్నాడు .
ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉత్తరాంధకు చెందిన ఓ నాయకుడు .. చంద్రబాబు జలుతున్న విత్తనాలు 2027 - 28 నాటికి భారీ వృక్షాలుగా మారుతాయని ఆయన చెప్పటం ఇప్పుడు ఆసక్తిగా మారింది .. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే ఆటు అనంతపురం నుంచి ఇటు విశాఖపట్నం దాకా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి . రీసెంట్గా 80 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి .. అలాగే పర్యాటక రంగం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వరకు పెట్టుబడులు వచ్చాయి ఇంకా రాబోతున్నాయి . అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏమిటంటే .. అన్ని వస్తున్నాయి వస్తున్నాయి అంటున్నారు ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి లబ్ధి చేయలేదు కదా అని వారు అంటున్నారు ..
అయితే ఇది నిజమే .. ఒక కంపెనీ ఇప్పుడు మొదలుపెడితే అది ఎదిగేందుకు కొంత సమయం పడుతుంది .. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది .. ఇప్పుడు మొదలు పెట్టిన అన్ని కంపెనీలు వచ్చే రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుని వర్కింగ్ మొదలుపడతాయి .. అప్పటివరకు సూపర్ సిక్స్ లో అన్ని పథకాలు కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ తర్వాత 2027 - 28 చివరి నాటికి రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి కనిపించడంతో పాటు ఉప్పది ఉద్యోగ అవకాశాలు పొందిన యువకులు కనిపిస్తారనేది ఆ సీనియర్ నాయకుడు చెప్పిన అసలైన మాట ..
ఇప్పటికిప్పుడు ఒక విత్తనం వేస్తే చెట్టు రాదు .. ఇక ఇప్పుడు చంద్రబాబు వేసింది కూడా అదే .. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ, ఏఐ టెక్నాలజీ లో గాని, డ్రోన్ వ్యవస్థలో గాని, ఐటీ రంగంలో గానీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఆనంద ఫలితాలు ఇస్తాయని .. ఒక్క ఒక ఏడాది రెండేళ్లలో ఈ ఫలితాలు అన్ని ప్రజల ముందు ఉంటాయని .. అప్పుడు అసలైన విశ్వరూపం అందరికీ కనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు .. ఇది కూడా నిజమే .. ఏ ప్రభుత్వమైనా పని చేసిన వెంటనే ఆ ఫలితం రాదు .. కాబట్టి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు వచ్చే రెండేళ్లలో కచ్చితంగా రాష్ట్రంలో కనిపిస్తాయి అనేది కూడా పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు .. ఇక మరి 2027 - 28 నాటికి చంద్రబాబు ఏసిన పెద్ద వృక్షం 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి .