ప్రస్తుతం చాలా వరకు దేశంలో  అనేక ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటిస్తూ సోమరులను చేస్తున్నారనే మాట ప్రజల నుండి రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా ఉచితం అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వొద్దు అనే నియమ నిబంధనలు పెట్టి మరీ ఇవ్వాలి. కానీ అనేక ఉచిత పథకాలు తీసుకువచ్చి అన్ని ఉచితంగానే ఇస్తే  చివరికి రాష్ట్రం, దేశం దివాలా తీసి మంగోలియా, వెనిజులా లాంటి దేశాల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ రాజకీయ నాయకులు వారి రాజకీయ అవసరాల కోసం ఉచితాలు ప్రకటిస్తూ ప్రజలను  సోమరులను చేస్తున్నారు.. ఇలా ఒక్క పార్టీ అని కాదు దేశంలో అన్ని పార్టీలు ఇలాగే తయారయ్యాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే  ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు.


ముఖ్యంగా ఉచిత విద్యుత్ అనేది ప్రతి ఒక్కరికి అందుతోంది. దీనికి తోడు  మరో ముందడుగు కూడా వేశారు.. ముఖ్యంగా ఆనాడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. మరి ఆ నిర్ణయాలు ఏంటి? విద్యుత్ నిర్ణయాల్లో సక్సెస్ అవుతారా అనే వివరాలు చూద్దాం.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు పథకాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సోలార్ కంపెనీలతో కలిసిపోయి రెండు రూపాయలు, రూపాయిన్నరకు కరెంటు వచ్చేట్టు ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఈ విధంగా భవిష్యత్తు తరాలకు ఉచిత విద్యుత్ అందించడం కోసం ఏ విధమైనటువంటి ప్లాన్ చేయాలో ఈ సోలార్ కంపెనీల ద్వారా ఆయన సెట్ చేసి పెట్టారు.

 కట్ చేస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్త డిస్కమ్ లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో  200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ తో పాటు స్కూలు, కాలేజీలకు  ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారట. ముఖ్యంగా  సోలార్ కంపెనీలకు సంబంధించి తక్కువ వడ్డీతో రుణాలు అందించి డిస్కములు ఏర్పాటు చేసి తక్కువకే కరెంటు అందేలా చూడాలని తెలియజేసారట. విద్యుత్ రంగంలో తెలంగాణను మోడల్ స్టేట్ గా తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ విద్యుత్ రంగంలో తెలంగాణ మోడల్ స్టేట్ గా సక్సెస్ అవుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: