ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి సామర్థ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పథకాల అమలుపైన దృష్టి పెట్టినట్లు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే టిడిపి, జనసేన మధ్య కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతోంది. ఇటీవలే జనసేన పార్టీలో కొన్నిచోట్ల నేతలను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా టిడిపి పార్టీకి ఎవరు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను జనసేన పార్టీ నుంచి చెప్పిన వినే పరిస్థితిలలో నాయకులు లేరనే విధంగా వినిపిస్తున్నాయి.


అయితే ఇప్పుడు తాజాగా కొన్ని నియోజకవర్గాలలో సీన్ రివర్స్ అయ్యి జనసేన పార్టీ పెత్తనం కొనసాగిస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఓటు బ్యాంకు కలిగి ఉన్న గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ తమ హవా కొనసాగించాలని ప్రయత్నం చేస్తుందని కొంతమంది టిడిపి నాయకులు కూడా తెలియజేస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడానికి పిల్లి సత్తిబాబు కుటుంబ సభ్యులు చాలా కృషి చేశారు.


అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నానాజీ ఇప్పటివరకు తనకు గాని తన పార్టీ కార్యకర్తలకు కానీ ఏ విధమైనటువంటి సహకారం కూడా అందించలేదనే విధంగా తెలుపుతున్నారు పిల్లి సత్తిబాబు. ముఖ్యంగా టిడిపి కార్యకర్తలు ఎవరైనా వెళితే ఊరి పేరు చెప్పి మరి ఆ ఊరు యొక్క జనసేన ప్రెసిడెంట్ ను తీసుకురావాలని చెబుతున్నారట. దీనివల్ల అటు పార్టీ కార్యకర్తలు చాలా మనస్థాపన చెందుతున్నారని టిడిపి నేతలు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ రూరల్ టిడిపి కోఆర్డినేటర్ గా ఉండి ఫలితం లేదని పిల్లి సత్తిబాబు తాజాగా రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం చర్చినయంశంగా మారింది. టిడిపి కోఆర్డినేటర్ , ఆర్డినేటర్ వర్గాలు మండల అధ్యక్షుడు నియామక విషయంలో వీరి మధ్య ఘర్షణ జరగడంతో టిడిపి పదవికి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలను తెలియజేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా లేఖ రాశారు సత్తిబాబు. తనకు పదవి అవసరం లేదని కేవలం పార్టీలో కార్యకర్తగా ఉంటానంటూ తెలిపారు పిల్లి సత్తిబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: