
ఇలాగే అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు పడుతుందని వారిని భయపెడుతోంది.రాజ్యాంగం ప్రకారం అరవై పని దినాలు హాజరుకాకపోతే స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు కానీ అది లెక్కలో పడలేదని స్పీకర్ స్పష్టంచేశారు. పైగా కొందరు దొంగ సంతకాలు పెట్టి తప్పించుకోవాలని చూసినా అది కూడా బహిర్గతమైంది. దీంతో అనర్హతా వేటు తప్పదని వారిలో భయం మొదలైంది. ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలే అసలు టర్నింగ్ పాయింట్ కావొచ్చు. ఆరుగురు ఎమ్మెల్యేలు తమలో తాము చర్చించి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. “మేము హాజరైనా… ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతాం. కానీ మా ఎమ్మెల్యే పదవులు కోల్పోం” అన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ నిర్ణయం తీసుకుంటే జగన్ ప్రతిష్టే పణంగా మారుతుంది. ఎందుకంటే ఆయన మాత్రం హాజరుకాకుండా ఉంటే, స్పీకర్ నేరుగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇక అసెంబ్లీకి రాకపోవడం వల్ల అనర్హతా వేటు పడితే… జగన్ గెలవడమే కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రజలు “తానే అసెంబ్లీకి వెళ్లని వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలి..?” అని ప్రశ్నిస్తారు. ఒకవేళ ఎమ్మెల్యేలు హాజరవ్వడం మొదలుపెడితే, జగన్ పరిస్థితి మరింత క్లిష్టం అవుతుంది. మొత్తానికి జగన్ ఒక దారిలో, ఎమ్మెల్యేలు మరో దారిలో నడవడం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈసారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఎవరు హాజరవుతారు, ఎవరు దూరంగా ఉంటారు అన్నది చూడాల్సిందే. కానీ ఒకటి మాత్రం ఖాయం… ఆరుగురు ఎమ్మెల్యేల హాజరు అయితే జగన్ పరువు రోడ్డుపై పడటమే కాకుండా, ఆయన రాజకీయ భవిష్యత్తుకే పెద్ద సవాల్ అవుతుంది!