
శుక్రవారం పాట్నాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను తీవ్రంగా తప్పుపట్టారు. “ప్రజల కోసం నిజంగా ఏదైనా చేయాలంటే కొత్త పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురండి. కానీ అబద్ధపు హామీలతో ప్రజల విశ్వాసాన్ని దోపిడీ చేయొద్దు,” అంటూ గట్టిగా హెచ్చరించారు.అమిత్ షా మాట్లాడుతూ.." దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో చొరబాటుదారుల పేర్లు తొలగించే ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని తెలిపారు. కుటుంబ వారసత్వ రాజకీయాలను నమ్ముకుంటున్న కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో బీహార్ ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. “దేశ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న బీజేపీని మరోసారి గెలిపించి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కొనసాగించండి. అభివృద్ధి బాటలో బీహార్ ముందుకు సాగాలంటే ఇది తప్పనిసరి,” అంటూ ప్రజలను కోరారు. అమిత్ షా ప్రసంగం పూర్తయ్యాక సోషల్ మీడియాలో ఆయన వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆయన చెప్పిన ప్రతి మాటలో ఉన్న లాజిక్, దానికి ఉన్న క్లారిటీ చూసి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. “అమిత్ షా మాట్లాడితే క్లారిటీతోనే మాట్లాడుతారు… ఎదుటివారిని ప్రశ్నించే విధానం అద్భుతం… ఆయన మాటలకు అర్థాలే వేరులే!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఫ్యాన్స్ కూడా ఆయనను ప్రశంసిస్తూ, “ఏ విషయం అయినా సూటిగా చెప్పే నాయకుడు అమిత్ షా మాత్రమే. మాటలలో హంగు ఆర్భాటాలు ఉండవు, కానీ ప్రతి వాక్యంలో ఆలోచన ఉంటుంది,” అని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఎన్నికల వేళలో ఆయన చేసిన ఈ సూటి వ్యాఖ్యలు బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.మొత్తం మీద, అమిత్ షా మాటలు ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా ఒక కఠినమైన హెచ్చరికగా మారాయి — “హామీ ఇవ్వడం సులభం, కానీ దాన్ని నెరవేర్చడం సాధ్యం అయ్యేలా ఆలోచించండి!” అని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు బీహార్ రాజకీయ చర్చల్లో హాట్టాపిక్గా మారాయి.