ఈ కరోనా కాలంలో చాలామంది తీవ్ర భయాందోళనలకు గురై , భగవంతుడిని స్మరించడం మొదలుపెట్టారు. అంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకు వస్తాడా ? మిగతా సమయంలో గుర్తుకు రాడా అనే విషయాలు తప్పకుండా అందరూ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వస్తే ఇంట్లో ఉన్న భగవంతుడు మాత్రమే ప్రార్థిస్తారు. ఊరి చివర నా కంటికి రెప్పలా కాపాడుకొనే గ్రామ దేవతలను ఎందుకు పట్టించుకోరు. ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సంరక్షించే తల్లిగా, భూతప్రేతాలను, గాలినీ , ధూళినీ దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచుకుంటాము. ప్రతీ సంవత్సరం అమ్మవారికి జాతర చేసి, నైవేద్యం సమర్పించి, మన కృతజ్ఞతను తెలుపుకుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతీ గ్రామం లోనూ వారికి తోచిన పేరుతో పిలుచుకుంటారు భక్తులు. సహస్రకోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది.