ప్రపంచ కప్ ముందు వరకు కూడా వరుసగా ద్వైపాక్షిక సిరీస్లలో విజయం సాధించిన టీమిండియా ఇక వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా రానించి టైటిల్ విజేతగా నిలుస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ టీమిండియా మాత్రం సెమీఫైనల్ నుంచి ఇంటిదారి పట్టి అభిమానులందరికీ కూడా నిరాశపరిచింది. వరల్డ్ కప్ లో ప్రదర్శన తర్వాత అటు టీమిండియా బ్యాటింగ్లో బౌలింగ్లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో అనుహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో రెండు వరల్డ్ కప్పుల వీరుడుగా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని సేవలను బీసీసీఐ వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భారత క్రికెట్ డైరెక్టర్గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ నెలాఖరులో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది తెలుస్తోంది.