tilaka dharaNa by hindu men కోసం చిత్ర ఫలితం


బొట్టు లేదా కుంకుమ తిలక ధారణ ఎందుకు చేయాలి. దాని లోని పరమార్ధమేమిటి? దాని ప్రాధాన్యమేమి? నుదుటనే ఎందుకు పెట్టు కోవాలి? యోగ శాస్త్రమున శరీర మందలి చక్రము లను గురించి ఉన్నది. రెండు కను బొమ్మల మద్య నున్నది (భృకుటి) "ఆజ్ఞాచక్రము" ఇది విద్య, శక్తి ,అలోచనలకు ఆలవాలము. ఇవియే మన మనుగడకు మూలాధారము ఆచక్రమును పూజించు టకు బొట్టు అక్కడ పెట్టుకోవాలి.


ప్రాచీన కాలమునుండి దీనిని మతపరమయిన గుర్తుగా భావించి చాతుర్వర్ణముల వారికీ వేరువేరు రంగులలో తిలకము దిద్దుకొను సాంప్రదాయ ముండెడిది. బ్రాహ్మణులకు తెల్ల చందనము తోనూ క్షత్రియులకు ఎర్రని రంగు తిలకము గాను, వైశ్యులకు పసుపు రంగు తోనూ, ఇతరులకు నల్లని భస్మముతోనూ, వారి వారి స్వచ్చతను, వృత్తులనూ తెలియ జేయునటుల ఉండెడివి. అవి వారి వృత్తులనూ విధులనూ నిర్దేశించునవిగా భావించెడి వారు. బ్రాహ్మణులలో కొందరు కుంకుమతో, నిలువుగనూ కొందరు విభుదితో అడ్డముగనూ తిలకముదిద్దుకొనుట నేటికినీ చూడ వచ్చును. అది వారి మత సాంప్రదాయము.

devasena in baahubali 2 కోసం చిత్ర ఫలితం

ప్రస్తుత కాలమున ఈ బేధములు అంతగా కనుపించకపోయిననూ అందరు హిందువులు బొట్టు పెట్టుకొను ఆచారము మాత్రము ఉన్నది. మనమందరమూ భగవదాజ్ఞకు బద్దులమనియూ మతమందు అనురాగము నమ్మకము కలవనియూ మనధర్మములను మనము పాటించుచూ దైవానుజ్ఞకు కట్టుబడి ఉండుమను సంకేతము ఇచ్చుట ఈ బొట్టుయొక్క ప్రాధాన్యము.


మనశరీరము నందు వివిధ నాడులు విస్తారముగా వ్యాపించి సర్వావయములను సక్రమముగా పనిచేయుటకు కావలసిన శక్తి మన శిరస్సు నుండి అజ్ఞా చక్రమునుండి రావలెను. అందుకు అవన్నియూ కేంద్రీకృతమయిన స్థానము శిరస్సు రెండు కను బొమ్మల మద్యప్రదేశము దానిని నిత్యమూ దైవముగా భావించి పూజించుటయే ఈ తిలకము/బొట్టు అక్కడ పెట్టుకొను సాంప్రదాయము. ఇది అందరూ పాటించవలసిందే.

devasena in baahubali 2 కోసం చిత్ర ఫలితం

కానీ స్త్రీలు మాత్రము ఈ బొట్టును అయిదు ప్రదేశములందు పెట్టుకొనవలెనని శాస్త్రమున చెప్పియున్నారు.  అవి శిరస్సున పాపిట మద్యనూ, ఆజ్ఞా చక్రమున, కంఠము న, వక్షస్థలమున,  నాభియందు కూడా ధరించవలెని యున్నది. దీని పాటించువారు తక్కువే. ఈ బొట్టు అయిదవ తనమునకు సంకేతముగా చెప్పిననూ పుణ్యస్త్రీలు ముఖ్య మయిననూ, వితంతువులు విభూది, భస్మము ధరించు అచారము కలదు. అదియునూ శాస్త్ర సమ్మతమే.


తిలక శబ్దం శ్రేష్ఠతా వాచకం. ఒక వ్యక్తి ధరించే వాటిలో శ్రేష్ఠమైనది అనే అర్థంలో నుదుట ధరించే బొట్టుని తిలకమని అంటారు. ఇది సర్వాంగాల్లో శ్రేష్ఠమైన శిరస్సున ధరించేది. శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించేవారు . ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు బొట్టు పెట్టుకోవటం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా బొట్టే నిదర్శనం.

సంబంధిత చిత్రం

బొట్టు లేదా తిలక ధారణ పరమార్ధం:

బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. కానీ అదే దాని పరమార్థం కాదు.అది అనునిత్యం జరిపే ఒక గొప్ప  సంస్కారం. కనుబొమల మధ్య ప్రదేశంలో వెనుకగా ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని మధ్య వేలితో సున్నితంగా స్పృశించి ఆజ్ఞాచక్రాన్ని  ప్రచోదన చేయటం తిలక ధారణలోని పరమార్థం.  శక్తి ప్రసరణ, వితరణ కేంద్రాలైన షట్చక్రాల పైన పెత్తనం చేస్తూ వాటిని తన అదుపులో ఉంచుకునేది, వాటిని ఆజ్ఞాపించి పని చేయించ గలిగినది కనుక భ్రూమధ్యంలో ఉండే ఈ చక్రానికి ఆజ్ఞా చక్రం అనే పేరు సార్థకం. ఇది సరిగ్గా ఉంటే మిగిలిన చక్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఆజ్ఞా చక్రం ప్రచోదనమైతే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది.  అందుకే గురువు శిష్యునికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భ్రూ మధ్య ప్రదేశాన్ని స్పృశించి  ఆజ్ఞా చక్రాన్ని ప్రచోదన చేస్తాడు.

tilaka dharaNa by hindu men కోసం చిత్ర ఫలితం

ఈ విధంగా ప్రచోదన చేసినదానికి సంకేతంగా  ఏదో ఒక గుర్తుని ఉంచటం ఆచారంగా వచ్చింది. దీని కోసం భారతీయులు ఉపయోగించిన సామాగ్రి వారి భావ విస్తృతిని తెలియజేస్తుంది. తరచుగా వాడేది కుంకుమ . అది పసుపులో కుంకుమ రాళ్ళు వేసి చేసినది కావచ్చు, నిమ్మరసంలో పసుపు కొమ్ములను నానవేసి చేసినది కావచ్చు, ఇంకా సిందూరం, తిరుచూర్ణం , గంధం,  అక్షతలు,విభూతి, చాదు. దీన్ని ఎన్నోరకాలుగా తయారు చేస్తారు.


ఇంకా  శక్తి ఉంటే కస్తూరి, పునుగు,జవ్వాది, పచ్చకర్పూరం, నవరత్నాలు

ఎవరి శక్తి ననుసరించి  వారి వైభోగం


తిలకాన్ని బట్టి ఏ సంప్రదాయానికి చెందిన వారో సులభంగా గుర్తించవచ్చు. ముఖాన బొట్టుఉండటం మరెన్నో అంశాలని సూచిస్తుంది. బొట్టు లేకపోతే అది పాచి మొహం ఇంకా  స్నానం కాలేదని సామాన్యార్థం. శుభకార్యాలు చేయటానికి అర్హతలేని సూతక సమయం కూడా కావచ్చు.  అంటే, నుదుటనున్న తిలకం శుభకార్యాలు చేయటానికి, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వర్తించటానికి  అర్హత ఉన్నదని సూచిస్తుంది. అందుకే స్నానం చేయగానే ముందుగా తమ తమ సంప్రదాయాల కనుగుణంగా  తిలక ధారణచేసి మరీ పూజాదికాలు నిర్వర్తిస్తారు. ముత్తైదువలైన స్త్రీలు ముఖాన బొట్టు లేకుండా ఒక్కక్షణమైనా ఉండరు. అది అయిదోతనానికి చిహ్నంకదా!  వివాహసమయం లో వరుడు తన పంచ ప్రాణాలను వధువు శరీరంలో నిక్షేపం చేసే స్థానాల్లో బొట్టుపెట్టుకునే చోటు కూడా ఒకటి.  


బొట్టు పెట్టుకోవటమే కాదు పెట్టటం కూడా మన సంప్రదాయంలో భాగం. బొట్టు పెట్టటం  మర్యాదకి చిహ్నం.  ఆహ్వానించ టానికి బొట్టు పెట్టి మరీ పిలవటం ఆచారమై పోయింది. ఎవరికైనా  పని అప్పచెప్పేటప్పుడు చందన మలది కుంకుమ పెడ తారు. పిల్లలకి బొట్టు పెడితే దిష్టి తగలదని నమ్మకం.  ఒకప్పుడు మంచి రంగు పరిమళం ఉన్న కుంకుమ తయారు చేయటం ఒక కళగా భావించేవారు. తరువాత ద్రవ రూపంలోను , ఆపై పేస్టు రూపంలోను, తిలకాలు వచ్చాయి. ఇప్పుడు బొట్టు బిళ్ళలు రక రకాల రంగులు, ఆకృతులలో వస్తున్నాయి.  ఇవి స్త్రీలకే పరిమితం.  కాని తిలక ధారణ మాత్రం స్త్రీ పురుష భేదం లేక అందరు పాటించ వలసినది మేలు కూర్చేది.


హిందూధర్మం లో "తిలకధారణ" కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. "భ్రూ-మధ్యము"లొ ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితము అవుతాయి అని శాస్త్ర పరిశోధనలలో తేలింది కూడా. అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే ఈ కుంకుమ వల్ల దృష్టి దోషం కూడా ఉండదు అని చెపుతారు. 


అలాగే వివాహిత మహిళలకు సౌభాగ్యచిహ్నాలుగా  మంగళ సూత్రం, నల్లపూసలు, మెట్టెలు, పసుపు, కుంకుమ, పూవులను చెపుతారు. మంగళ సూత్రం, నల్లపూసలు ధరించిన స్త్రీని చూడగానే ఆమె వివాహిత అని అర్ధం అవుతుంది ఎవరికైనా. ఆమె మిద వెంటనే గౌరవభావం వస్తుంది. 


పసుపులో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయో కొత్తగా చెప్పక్కరలేదు. అలాగే మెట్టెలు ధరించడం వల్ల కూడా కొన్ని నాడులు సక్రమంగా పని చేస్తాయి. ఇవన్ని శాస్త్రీయంగా నిరుపితమైన సత్యాలు. కానీ మనం ఎం చేస్తున్నాం? అత్యంత ముఖ్యమైన తిలకాన్ని పెట్టుకోవడం మానేస్తున్నాం. ఫాషన్ అంటూ నుదుటిన బొట్టు లేకుండానే బయటికి వెళ్ళిపోతున్నాం. మగవారైనా, ఆడవారైనా స్నానం చేసిన వెంటనే నుదుటిన బొట్టు ధరించాలి అని శాస్త్రం. ఇది ఎవరు పట్టించు కోవటం లేదు. 

పూజ చేసుకునే ముందు కాళ్ళకు పసుపు రాసుకొని కూర్చోవాలి అంటుంది శాస్త్రం. బొట్టే లేకపోతే, ఇంకా పసుపుకు స్థానం ఎక్కడ? మహా అయితే పూజ, లేదా నమస్కారం అయ్యే వరకు బొట్టు పెట్టుకొని ఇవతలకి రాగానే తుడిచెస్తున్నారు ఈకాలం అమ్మాయిలు. ఒకవేళ పెట్టు కొన్నా కనీ కనపడకుండా చిన్న నల్ల రంగు బొట్టు పెట్టుకుంటున్నారు. నల్లరంగు బొట్టు ఎప్పుడు పెట్టుకొంటారో వారికి ఎవరు చెప్పటం లేదు.


కొన్ని మతాలలో బొట్టు పెట్టుకునే అలవాటు లేదు. విదేశీయులు కూడా పెట్టుకోరు. వారిని అనుకరించి మనం మన పధ్ధతి మార్చుకోవడం ఎంత సబబు? ఇతర మతాల వాళ్ళు వాళ్ల అలవాట్లు, సంప్రదాయాలు వదులుకోవటం లేదే? మనకెందుకు ఆ అనుకరణ! విదేశీయులు మన భగవద్గిత, పురాణాలూ, ఇతిహాసాలలో ఉన్న గొప్పదనం గ్రహించి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం.


మగవారు కూడా బొట్టు పెట్టుకునే ఈ దేశంలో ఆడపిల్లలు బొట్టు మానేయటం ఎంత తప్పో ఎవరైనా అలోచించారా? అమ్మా! దయచేసి మీ పిల్లలకు బొట్టు పెట్టుకోవడం నేర్పించండి. మీ పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. ఇది కూడా బాధ్యతగా నేర్పించండి.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: