

ఇదిలా ఉంటే ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇటీవల జరిగిన రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో పిక్కకు గాయం కావడంతో అర్థాంతరంగా మైదానాన్ని వీడాడు. ఆ తరువాత మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత దృష్ట్యా మిగతా రెండు మ్యాచ్లకూ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న ఉమేశ్ ఈ తీపికబురును అభిమనులతో పంచుకున్నాడు.
గాయం నుంచి కోలుకునేందుకు కొన్ని రోజులు పాటు ఉమేశ్ ఇంటి వద్దే ఉండనున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కోసం వెళ్లనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారం భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించాలని ఉమేశ్ భావిస్తున్నాడు. మరి అతడు అప్పటికల్లా ఫిట్నెస్ సాధిస్తాడా..? తుది జట్టులో స్థానం సంపాదిచగలుగుతాడా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.