
కాగా ఇప్పుడు మరోసారి ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కెప్టెన్సీ రికార్డుల విషయంలో భారత క్రికెట్లో ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగలేరని గంభీర్ బల్లగుద్ది మరీ చెప్పాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 3 ఐసీసీ ట్రోఫీలను గెలిచిందని, కెప్టెన్గా ఇంత కంటే ఘనతను భారత క్రికెట్లో ఎవరూ సాధించలేరని తాను అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ధోనీ గురించి స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన వీడియోలో గంభీర్ ఈ మాటలు చెప్పడం గమనార్హం.
ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ... “చాలా మంది కెప్టెన్లు వున్నారు, అదేవిధంగా వస్తున్నారు. వెళుతున్నారు. కానీ ధోనీ కెప్టెన్సీ, కెప్టెన్సీ రికార్డులను భారత క్రికెట్లో ఎవరూ సమం చేయలేరని నేను భావిస్తున్నాను. టెస్టుల్లో నంబర్ వన్ పొజిషన్ కానీ, విదేశాల్లో సిరీస్లుి కానీ గెలవొచ్చు. కానీ 3 ఐసీసీ ట్రోఫీలు.. అందులో 2 ప్రపంచకప్లుస, ఓ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలు ధోనీ ఖాతాలో ఉన్నాయి. ఇవి మరెవ్వరికీ ఇప్పట్లో సాధ్యం కాదు. ఇంతకంటే గొప్ప విజయాలు ఏవీ ఉండవు” అని గంభీర్ ఈ సందర్బంగా చెప్పాడు.