భారతీయ మార్కెట్ లో పొర్డ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. సంవత్సరం పొడవునా కొత్త ఫీచర్లు ఉన్న కార్లను తయారు చేస్తున్నారు. అందరికీ అందుబాటు ధరలలో లభిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు మరో కొత్త వేరియంట్ తో కారును విడుదల చేయడానికి రెడీ అవుతుంది. ఎకోస్పోర్ట్ ఎస్‌యువి పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇదే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ ఈ.. ఈ కొత్త వేరియంట్ కారు ధర పెట్రోల్ ఇంజిన్ అయితే రూ. 10.49 లక్షలు, అదే డీజిల్ ఇంజిన్‌తో రూ. 10.99 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ ఈ ని ప్రస్తుతం అమెరికా, యురోపియన్ మార్కెట్లలో అమ్ముతున్నారు. వీటికి రేర్‌-మౌంటెడ్ స్పేర్ వీల్ రాదు.


అదేకాకుండా, భారతదేశంలో ఇప్పటికే విక్రయిస్తున్న ఎకోస్పోర్ట్ లాగానే ఈ కారు కూడా మెకానికల్ బిల్ట్ ఒకేలా ఉంటుంది. అయితే డిజైన్‌లోనూ, అలాగే చూడటానికి ప్రత్యేకంగా, విలక్షణంగా ఉండాలనుకునే కస్టమర్లు పెరుగుతున్నారు.ఇదే క్వాలిటీలతో ఉంది సరికొత్తగా వెలువడిన ఎకోస్పోర్ట్ ఎస్ ఈ అంటారు ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్‌, సేల్స్ & సర్వీసెస్‌లో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా ఉన్న వినయ్ రైనా అన్నారు.ఫోర్డ్ పాస్ యాప్ ఇంటిగ్రేషన్‌తో సహా ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కూడా ఉంది. ఎకోస్పోర్ట్ ఎస్ ఈ ఎంపికలో వివిధ ఆఫర్లు ఉన్నాయి.



1.5 లీటర్ల మూడు సిలిండర్లు టైవిసిటి పెట్రోల్ ఇంజిన్ అన్నది ఈ సెగ్మెంట్‌లో ఉత్తమంగా 122 పిఎస్ పవర్‌, 149 ఎన్ ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. అలాగే , 1.5 లీటర్ల టిడిసిఐ డీజిల్ ఇంజిన్ 100 పిఎస్ పవర్‌, 215 ఎన్ ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉన్న ఇకోస్పోర్ట్ లైనప్‌ కారును ఫోర్డ్ పరిచయం చేసింది. ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం వీటి సేల్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: