ఇక పెరుగుతున్న ఫ్యూయల్ రేట్ల కారణంగా వినియోగదారులంతా కూడా ఎలక్ట్రిక్ కార్లు ఇంకా అలాగే బైక్ ల వైపు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎక్కువ మార్కెట్ కలిగిన ఇండియాలో వివిధ కార్లు ఇంకా బైక్ కంపెనీలు తమ కొత్త ఈవీ మోడళ్లను విడుదల చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి.ఇక ఇదే దారిలో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అయిన జియోమీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారు చేస్తుందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. కానీ కంపెనీ ఈ వార్తలను ఇంకా వెరిఫై చెయ్యలేదు. ముఖ్యంగా ఈవీ మార్కెట్ లోకి టాప్ టెక్ కంపెనీ లు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. సోనీ, యాపిల్ ఇంకా అలాగే ఒప్పో వంటి కంపెనీలు ఈవీ మార్కెట్ వైపు ఎంతగానో మొగ్గు చూపుతున్నాయి. అయితే యాపిల్ కంపెనీ కూడా 2025 లో ఎలక్ట్రిక్ కార్ ప్రవేశపెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే 2026 వ సంవత్సరంలో యాపిల్ కంపెనీ తన కొత్త ఈవీ కార్ మార్కెట్ లోకి వస్తుందని పలు నివేదికల నుంచి సమాచారం తెలుస్తుంది.


ఇప్పుడు మొబైల్ కంపెనీ జియోమీ కంపెనీ కూడా ఈవీ మార్కెట్ లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.ఇక చైనాలోని మంచు రోడ్లల్లో జియోమీ ఈవీ కార్ ను పరీక్షించినట్టు సమాచారం తెలుస్తుంది. జియోమీ వ్యవస్థాపకుడు ఇంకా సీఈఓ లీ జున్ న్యూ ఈవీ కార్ ను రైడ్ చేస్తూ కనిపించారని కొన్ని ఫొటోలు కూడా వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోను పరిశీలిస్తే జియోమీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ కార్ గురించి చాలా విషయాలను గోప్యంగా ఉంచింది. అయితే ఈ కార్ చూడడానికి చాలా క్లాసీ లుక్ తో ఎలిగెంట్ డిజైన్ తో వస్తుందని సమాచారం తెలుస్తోంది. ఇంకా అంతేగాక ఈ కార్ స్పోర్టీ సెడాన్ గా కూడా కనిపిస్తుందని పలు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకా అలాగే ఈ కార్ లైడార్ సెన్సార్ ఉందని, డ్రైవింగ్ లేదా ఆటోమేటిక్ డ్రైవింగ్ ద్వాారా ఇది పని చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కార్ గురించి అదనపు విషయాలు మాత్రం తెలియలేదు. అవి ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

MI