బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఇప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో సరికొత్త అంశాలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ అనూహ్య మృతిపై సిబిఐ విచారణ చేయలని ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ జస్టిస్ ఫర్ సుశాంత్ అనే ఒక ఫోరం ఏర్పాటు చేశారు.
సుశాంత్ ఆత్మహత్య పై సీబీఐ విచారణ కోసం ఈ ఫోరం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని అంటూ ఆయన సోషల్ మీడియాకు వెల్లడించారు. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా జస్టిస్ ఫర్ సుశాంత్ ఫోరమ్ పోరాడుతుంది అంటూ ఆయన స్పష్టం చేశారు.