ఈ మద్య మళ్లీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది.  గత రెండు నెలల క్రితం లాక్ డౌన్ కారణంగా రోడ్లపై వాహనాల తాకిడి తగ్గిన విషయం తెలిసిందే. దాంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీతా తగ్గింది.  తాజాగా సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి క్లాస్‌మేట్ కుటుంబం దుర్మరణం పాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలేనికి చెందిన మైలాబత్తుల సత్యానందం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. కాగా, చిరంజీవి, సత్యానందం ఇద్దరూ బాల్య స్నేహితులు.

 

రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వీరికి కుమారుడు జోసఫ్, కుమార్తె ఉన్నారు. అయితే విజయకుమారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సత్యానందం, జోసెఫ్‌తో కలిసి కారులో నిన్న తెల్లవారుజామున  విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పొందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: