టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో మీరాబాయి చాను చారిత్రాత్మక రజత పతకం గెలిచిన సంగతి అందరికి తెలిసిందే. మీరాబాయి సాధించిన రజత పతకం మరియు ఆమె ధరించిన చెవి కమ్మలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒలంపిక్స్ రింగుల ఆకారంలో ఉన్న ఆమె బంగారు చెవి కమ్మలు ఐదేళ్ల క్రితం ఆమె తల్లి బహుమతిగా ఇచ్చిందట. రియో ఒలంపిక్స్ లో గెలవడానికి గుడ్ లక్ చెప్తూ ఈ బహుమతిని అందజేసింది మీరాబాయి తల్లి. 2016 గేమ్స్ లో ఆమెకు అదృష్టం తీసుకువస్తుందని తల్లి ఈ బహుమతిని అందజేసింది కానీ అక్కడ అదృష్టం తలుపు తట్టక పోయినా ప్రస్తుతం టోక్యోలో గెలిచి యావత్ భారత దేశ దృష్టిని ఆకర్షించింది. ఈ విషయంపై మీరాబాయ్ తల్లి స్పందిస్తూ తన కూతురిని టీవీలో చూశానని 2016 ఒలింపిక్స్ ముందు ఇచ్చిన చెవి రింగులు పెట్టుకుందని కానీ అప్పుడు అదృష్టం తీసుకురాకపోయినా ఇప్పుడు గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: