ఢిల్లీ బీసీ కమీషన్ వద్దకు చేరింది ప్రొద్దుటూరు టిడిపి నేత నందం సుబ్బయ్య హత్య కేసు. సుబ్బయ్య హత్య కేసు పై బీసి కమీషన్ వద్ద కడప ఎస్పీ అన్బురాజన్, బాధితురాలు అపరాజిత హాజరు అయ్యారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన భావమరిది బంగారు రెడ్డి, మున్సిపల్ కమీషనర్ రాధ.. మూడు పేర్లను ఎఫ్ ఐఆర్ లో చేర్చాలని బీసి కమీషన్ ను హతుడు సుబ్బయ్య సతీమణి అపరాజిత కోరారు.

15 రోజుల్లో విచారించి అపరాజిత చెప్పిన వారి పై విచారించి చర్యలు చర్యలు చేపట్టాలని ఎస్పీ ని బీసి కమీషన్ ఆదేశించింది. ఈ కేసు లో అప్పటి డిఎస్పీ ని మార్చి  వేరే డిఎస్పీ కి కేసును అప్పగించి విచారణ చేపడతామని  బిసి కమీషన్ కు ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. జాప్యం జరగకుండా పూర్తి చేయాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp