గుంటూరు జిల్లాలో అమూల్ పాల సేకరణ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శులకు బాధ్యతలు ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులపై అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అమూల్ పాల సేకరణ పై షోకాజ్ నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... తమకు సంబంధం లేని పనులు కూడా కార్యదర్శులు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రజలకు ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు అమూల్ కు పాలు పోయడానికి ఇష్టపడటం లేదు అని పేర్కొన్నారు. ప్రజలకు ఇష్టం లేని అంశానికి మమ్మల్ని ఎలా బాద్యుల్ని చేస్తారు అని నిలదీసారు. జిల్లా పంచాయతీ అధికారి తీరు బాధకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి చిన్న విషయానికి షోకాజ్ నోటీసులు ఇస్తే ఉద్యోగులు ఆత్మస్జైర్యం కోల్పోతారు అని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారిని కలిసి నోటీసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసాం అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: