ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస రైల్వే స్టేష‌న్‌లో ఓ అనూహ్య‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ వాహ‌నాన్ని అక‌స్మాత్తుగా రైలు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 100 మీట‌ర్ల దూరం వ‌ర‌కు అంబులెన్స్‌ను రైలు ఈడ్చుకెళ్లింది. ఒక రోగిని తీసుకొచ్చేందుకు ప్లాట్‌ఫామ్ పైకి అంబులెన్స్ వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఈ దుర్ఘ‌ట‌న‌లో అంబులెన్స్‌ డ్రైవ‌ర్‌,  వైద్య నిపుణుడు క్షేమంగానే బ‌య‌ట‌ప‌డ‌డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రోగిని ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్స్ ప‌లాస రైల్వేస్టేష‌న్ ప్లాట్‌ఫామ్ పైకి వెళ్తున్న అంబులెన్స్‌ను ఇంట‌ర్‌సిటీ రైలు ఢీ కొట్టింది. అంతసేపు ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా అంబులెన్స్‌ను రైలు ఢీ కొట్ట‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గుమి కూడడంతో ఏమి జ‌రిగిందో అర్థం కాక కొంత మంది ప్ర‌యాణికులు బిత్త‌ర‌పోయారు. ఆనోటా ఈ నోటా ప్ర‌మాదం గురించి తెలిసి ఒక్క‌సారిగా హుటాహుటిన అక్క‌డికి చేరుకుని ప్ర‌మాదాన్ని తిల‌కిస్తుండ‌గా పోలీసులు అక్క‌డి నుంచి అంద‌రినీ పంపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: