గత కొంత కాలంగా భారత దేశంలో  కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేర్పులు వచ్చాయి. ముఖ్యంగా దేశంలో జియో వచ్చినప్పటి నుంచి నెట్ వర్క్ సంస్థల్లో గందరగోళం మొదలైంది.  ఈ నేపథ్యంలో జియో కి తగ్గట్టు పలు నెట్ వర్క్ సంస్థలు తమ రేట్లు తగ్గించడం మొదలు పెట్టాయి.

ఇక ప్రభుత్వ రంగ బిఎస్‌ఎన్‌ఎల్‌ (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌)తో కుదుర్చుకోనున్న ఒప్పందంలో భాగంగా, కెనడాకు చెందిన డేటా విండ్‌ సంస్థ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది. రోజుకు కేవలం ఒక్క రూపాయితో అపరిమిత డేటాను అందించనున్నట్టు డేటావిండ్‌ వెల్లడించింది.

నెలకు రూ. 30 ఖర్చుతో డేటావిండ్ స్మార్ట్ ఫోన్లలో నెలంతా అన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించవచ్చని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ తో డీల్ చివరి దశకు వచ్చిందని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: