
మనిషి వయసులో ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. వృద్దాప్యం వచ్చేసరికి కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఒకప్పుడు పుష్టికరమైన ఆహారం తిని.. కష్టించే వారు ఇలాంటి కష్టాలు చాలా తక్కువ పడ్డారు. కానీ ఇప్పుటి జనరేషన్ మాత్రం తక్కువ వయసులోనే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అంత బాధపెడుతుంటాయి ఈ కీళ్లనొప్పులు. మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు ఇలా తదితర భాగాల్లో కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటాక వస్తుండేవి. ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్యలలో ఒకటి మోకాళ్ల నొప్పులు. ఇది ఒబిసిటీ వలనే కాదు సన్నటి వాళ్ళు కూడా మోకాళ్ల నొప్పులతో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకొస్తున్నాయో మీకు తెలుసా.
మనకి ఎక్కడైతే నొప్పులుగా ఉన్నాయో అక్కడ మనకు ఆక్సిజన్ తగ్గుతుందని అర్ధం. ఆక్సిజన్ ని పెంచే ఆయుర్వేద విధానం ఏంటంటే ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి ముక్కుల్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ బాగా పెరుగుతుంది, అలాగే ఆహార విధానంలోనూ డైజెషన్ క్రియ సరిగా లేకపోయినా సరే ఎక్కువ నొప్పులు వస్తాయి.
దీనికి చక్కటి పరిష్కారం ఏమిటంటే కలబంద గుజ్జును వేడి చేసి అందులో కొద్దిగ మిరియాల పొడి, పటిక బెల్లం పొడి వేసి బాగా కలుపుకుని తింటే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఆవాలను మెత్తగా నూరి, పొడి చేసి అందులో కొద్దిగ నీళ్ళు పోసి గుజ్జుగా చేసుకోవాలి.ఇలా చేసిన గుజ్జును ఒక క్లాత్ కి రాసి దానిని మోకాల పైన పూర్తిగా కప్పేలాగా చుట్టుకొని ఒక 15 లేదా 20 నిముషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. మనం కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తుంటే ఎక్కడా కూడా నొప్పులు ఉండవు. మోకాళ్ల నొప్పులే కాదు అసలు ఏ నొప్పులు ఉండవు. అందుకే తిరుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.