కార్న్ చాట్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఎండిన మొక్క గింజలతో చేసే ఈ చాట్ అనేది చాలా రుచిగా ఉంటుంది.ఇక దీనిని మొక్క గుడాలు అని అంటారు.వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. ఈ కార్న్ చాట్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ చాట్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే కార్న్ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి..  ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక కార్న్ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..ఎండిన మొక్కగింజలు  ఒక కప్పు, నీళ్లు  రెండున్నర కప్పులు, ఉప్పు అర టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్స్, జీలకర్ర అర టీ స్పూన్, ఆవాలు  అర టీ స్పూన్, దంచిన ధనియాలు  ఒక టీ స్పూన్, ఎండుమిర్చి 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ  1, తరిగిన పచ్చిమిర్చి  3, దంచిన వెల్లుల్లి రెబ్బలు  ఒక టీ స్పూన్, కరివేపాకు ఒక రెమ్మ, పసుపు  పావు టీ స్పూన్, కారం  అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర  గుప్పెడు, నిమ్మరసం  అర చెక్క తీసుకోవాలి.


కార్న్ చాట్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మక్కలను బాగా శుభ్రంగా కడగాలి. ఆ తరువాత తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వీటిని కుక్కర్ లో వేసి నీళ్లు పోయాలి. తరువాత ఉప్పు, నూనె వేసి మూతని పెట్టాలి. ఇప్పుడు ఈ మక్కలను 9 నుండి 10 విజిల్స్ వచ్చే దాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ గింజలను వడకట్టి పక్కకు ఉంచాలి.ఆ తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసి వేయించాలి. ఆ తరువాత ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.తరువాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే దాకా వేయించిన తరువాత వెల్లుల్లి రెబ్బలు ఇంకా కరివేపాకు వేయించాలి. ఆ తరువాత ఉడికించిన గింజలు వేసి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు ఇంకా కారం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే కార్న్ చాట్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: