నిర్వాహకులు కూడా సినీస్టార్స్ ..మోడల్స్ ను .. ఈవెంట్లకు తీసుకొచ్చి.. వారు కూడా బాగా క్యాష్ చేసుకోవడం గమనార్హం. ఇక వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఒక్క రాత్రికి ఈ సినీ స్టార్స్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బాగా సంపాదించుకుంటున్నారు.. ప్రత్యేక న్యూ ఇయర్ ఈవెంట్ , పార్టీలలో పాడినందుకు, ఆడినందుకు బాగానే డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఈ ముద్దుగుమ్మలు. ముఖ్యంగా మరికొంతమంది హీరోయిన్లు అయితే ఈ పార్టీలో ఆడిపాడేందుకు నిర్వాహకులతో భారీగానే డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక వారి డిమాండ్ ను బట్టి నిర్వాహకులు కూడా కోట్ల రూపాయలు ముట్ట చెబుతూ ఉంటారు.ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను ఎవరెవరు ఏ రేంజ్లో డబ్బు తీసుకున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సన్నీ లియోన్:హాట్ బ్యూటీ గా గుర్తింపు పొందిన ఈమె ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ కంటే రెట్టింపు స్థాయిలో తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగుళూరులో ఉన్న ఒక స్టార్ హోటల్లో నిర్వహించిన ఈవెంట్ కి డిసెంబర్ 31 రాత్రి సన్నీలియోన్ హాజరయ్యారు.. ఇకపోతే ఏకంగా ఈమెకు ఒక రాత్రి గాను 3 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం.
తమన్నా:మిల్క్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కొత్త సంవత్సర వేడుకలలో పాల్గొనింది. గుంటూరు.. విజయవాడ మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్లో తన అందాలతో మంచి ప్రదర్శన ఇచ్చినందుకు గాను నిర్వాహకులకు కోటి రూపాయలు అందించారు. ఇదే పార్టీలో లో పైసా వసూల్ సినిమా హీరోయిన్ కైరా దత్, మేహరీ కూడా పాల్గొనగా వీరికి ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం.
అంతేకాదు మరొక ఈవెంట్ లో పూనం పాండే పాల్గొని రూ. 30 లక్షలు తీసుకోగా.. శ్రియ శరణ్ కూడా ఇంకొక ఈవెంట్ లో పాల్గొని రూ.30 లక్షల తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.