రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను మరియు ఒక టీజర్ ను విడుదల చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ పోస్టర్ లకు ,  టీజర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడం లేదు అని , జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని చాలా రోజుల క్రితమే 28 సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

కాకపోతే ఆది పురుష్ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించడంతో , మరి మూడు నెలల వ్యవధి లోనే ప్రభాస్ నటించిన మరో సినిమా వచ్చినట్లు అయితే ఆ మూవీ పై అంత క్రేజ్ ఉండకపోవచ్చు అని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు , దానితో సలార్ మూవీ ని కూడా సెప్టెంబర్ 28 వ తేదీన కాకుండా మరి కొంత ఆలస్యంగా విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వేలువడలేదు. ఇది ఇలా ఉంటే సలార్ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: