ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ రెండు పథకాలను సులభంగా చేసుకుని విధంగా తమ కస్టమర్లకు మరొక ఎనేబుల్ను తీసుకువచ్చింది ఎస్బిఐ.. ఒకవేళ బీమా చేయబడిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించిన ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం కింద రూ .2లక్షల రూపాయలు అందుతుంది.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ .2లక్షలు లేదా ఏదైనా వైకల్యం ఏర్పడితే
.. ఒక లక్ష రూపాయలు రక్షణగా ఈ పథకం ఉంటుందట. వీటికి 12 రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది.అయితే ఒక ఏడాది మాత్రమే ఈ పథకం ఉంటుంది. ప్రతి ఏడాది వీటిని పునరుద్దించుకునే అవకాశం ఉంటుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 70 సంవత్సరాల వరకు ఈ పథకంలో ఉండవచ్చు.
ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా వయసు విషయానికి వస్తే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య కలిగిన ఎవరైనా సరే వీటిని వినియోగించుకోవచ్చు..రెండు లక్షలు బీమా తో పాటు ఒక సంవత్సరం జీవిత బీమాను కూడా అందిస్తుంది.. 2015 లో కేంద్ర ప్రభుత్వం జీవన్ జ్యోతి బీమాను ప్రారంభించింది ప్రతి ఏటా రూ .436 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే.. అంటే నెలవారీగా చూసుకుంటే 35.3 రూపాయలు ఒక వ్యక్తికి పడుతుంది దీంతో మీరు రూ .2లక్షల ప్రమాద బీమా ని కూడా పొందవచ్చు. ఈ పథకం మే ఒకటి నుంచి జూన్ 31 వరకు మాత్రమే ఉంటుంది.. ఎవరైనా వ్యక్తి మరణిస్తే 2 లక్షల రూపాయలు అందిస్తారు.