సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల వరుసగా మూడు హిట్స్ అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఆయన తన తదుపరి సినిమా కథ విషయమై పలువురు దర్శకులతో చర్చలు జరిపి, ఫైనల్ గా మెగాస్టార్, కొరటాల మూవీ తో పాటు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే దానితో పాటు నేడు టాలీవుడ్ లో మరొక సంచలన వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జునరెడ్డి సినిమా అప్పట్లో పెద్ద సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్ కావడంతో విజయ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్, మార్కెట్ లభించింది. 

 

ఇక ఆ సినిమా దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగ, దానికి సీక్వెల్ అయిన అర్జున్ రెడ్డి పార్ట్ 2 కథని మహేష్ తో చేయనున్నారని నేడు సంచలన వార్త ప్రచారం అవుతోంది. వాస్తవానికి గతంలో మహేష్ తో సందీప్ ఒక సినిమా చేయాల్సి ఉందన్న వార్తలు వచ్చాయి. ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ కూడా అతి త్వరలో మహేష్ గారికి ఒక స్టోరీ వినిపించబోతున్నాను అంటూ చెప్పడం జరిగింది. అయితే ఆ తరువాత కథ విషయం ఏమి జరిగింది అనేది మాత్రం తెలియనప్పటికీ, ఆ సమయంలో ఆయన చెప్పిన కథ అర్జున్ రెడ్డి కి సీక్వెల్ అని అంటున్నారు. 

 

వాస్తవానికి దానికి బదులుగా సందీప్, మహేష్ కు చెప్పిన కథ వేరని, అయితే ఆ కథ మహేష్ కు పెద్దగా నచ్చకపోవడంతో అర్జున్ రెడ్డి మాదిరిగా మంచి ఎమోషనల్ కంటెంట్ స్టోరీ ఉంటె చెప్పమని అడుగగా, సందీప్ ఆ వెంటనే తన వద్ద కొంత సిద్ధం చేసుకున్న అర్జున్ రెడ్డి 2 స్క్రిప్ట్ ని చెప్పారని, అయితే ఆ స్టోరీ లైన్ తో మహేష్ కూడా ఇంప్రెస్ అయ్యారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని ప్రస్తుతం ఈ వార్త మాత్రం పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కాగా దీనిలో నిజం లేదని కొందరు మహేష్ ఫ్యాన్స్, తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: