షారుఖ్ ఖాన్ పుత్రుడు ఆర్యన్ ఖాన్ తెరంగేట్రానికి సిద్ధమయ్యాడని.. కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి వస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి షారుఖ్ ఖాన్ సంగతేంటి.. రెండేళ్లుగా కెమెరా ముందుకు రాని బాద్ షా ఇంకెన్నాళ్లు.. అజ్ఞాతవాసంలో ఉంటాడని అతని అభిమానులంతా బాధపడుతున్నారు. 

 

షారుఖ్ ఖాన్ జీరో తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. షారుఖ్ శారీరకంగా చాలా కష్టపడి మరగుజ్జుగా నటించిన ఈ మూవీ జనాలను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్లను కూడా గట్టి దెబ్బ కొట్టింది. 

 

జీరో.. బాక్సాఫీస్ దగ్గర హీరో కాలేదని.. షారుఖ్ ఖాన్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. డబ్బు, టైమ్ రెండింటికీ న్యాయం చేయలేకపోయానని బాధపడ్డాడు. ఈ బాధలోనే రాకేశ్ శర్మ బయోపిక్ ను పక్కనపెట్టేశాడు. ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసుకొని ఇంటికే పరిమితమయ్యాడు. రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా మొదలుపెట్టకుండా క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. 

 

షారుఖ్ ఖాన్ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తాడా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. బాద్ షా మునుపటిలా అదరగొడితే పండుగ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ షారుఖ్ మాత్రం వీళ్లను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. కనీసం కొత్త సినిమాల ఎనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండా అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. 

 

ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. టెన్ పర్సంట్ సక్సస్ రేట్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ రన్ అవుతోంది. అలాంటిది వరుస ఫ్లాపులొచ్చాయని కెరీర్ వదిలేస్తే.. సూపర్ స్టార్స్ కాలేరు. కానీ బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్న షారుఖ్ ఖాన్ మాత్రం పరాజయాలొచ్చాయని రెండేళ్ల నుంచి కెమెరాలకు దూరంగా ఉంటున్నాడు. సినిమాలను పక్కనపెట్టేశాడు. 

 

షారుఖ్ ఖాన్ కు చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. పైగా దిల్ వాలే, జబ్ హ్యారీ మెట్ సెజల్ లాంటి డిజాస్టర్లు పడ్డాయి. ఈ ఫ్లాపులతో షారుఖ్ మార్కెట్ చాలా ఎఫెక్ట్ అయింది. ఈ బాధని మరింత పెంచింది జీరో. ఫ్లాపుల ప్రవాహంలో సునామిలా షారుఖ్ ఖాన్ ను అతలాకుతలం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: