అయితే ఈ నాలుగు సినిమాలను ఒకే సారి చిత్రీకరించబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం సినీ ప్రముఖులంతా తమ సినిమాల చిత్రీకరణను ప్రారంభించాలంటేనే జంకుతున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తనని కరోనా ఏమి చేయలేదని, కరోనా తనని ఆపలేదని చెబుతున్నాడు. రెండు శృంగార భరితమైన సినిమాలు తీసి బాగా డబ్బులు సంపాదించి వాటిని మంచి సినిమాల షూటింగ్ ల కొరకు రాంగోపాల్ వర్మ వాడుతున్నాడు.
అమృత ప్రణయ్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న క్రమంలో తమ ఫోటోలు వాడారని అమృత తరుపు వాళ్ళు రామ్ గోపాల్ వర్మ పై మిర్యాలగూడలో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా సినిమా ప్రారంభం అవ్వకముందే రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించే ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ 4 సినిమాలు శ్రేయాస్ ఈటీ యాప్/ ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో డిజిటల్ రిలీజ్ అవ్వనున్నాయి.
Powered by Froala Editor