మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం రీమేక్ రైట్స్ ను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్నారు. ఇద్దరు స్టార్స్ నటించాల్సిన ఈ సినిమాలో ఒక హీరోగా రానా ఫిక్స్ అవగా మరొకరు ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనల్ అవలేదు. బాలకృష్ణ, రవితేజలను అనుకున్నా ఆ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. ఇక అయ్యప్పనుం కోషియం రీమేక్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్ను పడ్డది. పవన్ ఎంట్రీతో ఆ సినిమా లెక్క మారింది.

పవన్ కోసం ఈ సినిమాకు త్రివిక్రం డైలాగ్స్ రాసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. పవన్, రానా కలిసి ఈ రీమేక్ చేస్తారని టాక్. డాలీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. సూపర్ హిట్ రీమేక్ పై ఈ స్పెషల్ అప్డేట్ పవర్ స్టార్, దగ్గుబాటి ఫ్యాన్స్ ను అలరిస్తుంది. పవన్, రానా కలిసి చేస్తే తప్పకుండా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.

ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పవన్, రానా సినిమా ఉంటుందని టాక్. మరి ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి. దసరాకి వకీల్ సాబ్ టీజర్ వస్తుందని అనుకోగా అది కాస్త దీపావళికి షిఫ్ట్ చేసినట్టు టాక్.                                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: