పవన్ కల్యాణ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ అమీషా పటేల్.. ఇప్పుడు అవకాశాలు లేక ముంబైలోనే ఉంటోంది. లాక్ డౌన్ టైమ్ లో షూటింగ్ లు అన్ని క్యాన్సిల్ కావడంతో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో ముక్కూ మొహం తెలియకపోయినా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు అమీషా పటేల్.
అయితే బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమీషా పటేల్ కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర కోసం అమీషా పటేల్ ప్రచారం చేయడానికి ఆయన నియోజకవర్గానికి వెళ్లారట. ఈ క్రమంలో ఏకంగా అబ్యర్థి ప్రకాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని అమీషా అంటున్నట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ ప్రచారంలో ఎవరు ఎప్పుడు, ఎటువైపునుంచి దూసుకొస్తారో తెలియలేదని, ఎవరు ఎక్కడ టచ్ చేస్తారో అని భయపడిపోయానని అమీషా అన్నట్టు ఆ ఆడియో టేప్ లో ఉంది. అందుకే త్వరగా ప్రచారం ముగించుకుని తాను ముంబై తిరిగొచ్చేశానని చెప్పారు.

తన టీమ్ వెంటే ఉండి తనను కాపాడారని, మరో అవకాశం లేకపోవడంతో  సురక్షితంగా బయటపడి ముంబైకి చేరుకున్నానని అమీషా అన్నట్టు ఆ ఆడియోలో ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎల్జేపీ అభ్యర్థిపై ఆరోపణలు రావడంతో.. ఇది వైరిపక్షాల కుట్ర అని కొట్టి పారేస్తున్నారు నేతలు.

అయితే అమీషా పటేల్ పై సానుభూతితోపాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. డబ్బులిస్తే ప్రచారానికి వెళ్లడానికి ఇష్టపడిన అమీషా పటేల్.. కనీసం తాను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరికోసం వెళ్తున్నాను, వారు ఎలాంటివారు అని ఆలోచించుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కేవలం పారితోషికం కోసం ఇలా బైటకు వెళ్తే లేనిపోని అనర్థాలు కొనితెచ్చుకున్నట్టేకదా అంటున్నారు. ఇప్పటికైనా ప్రమోషన్ కార్యక్రమాలకోసం బైటకు వెళ్లే హీరోయిన్లు.. తమ జాగ్రత్తల్లో తాము ఉండటం మంచిదని హితవు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: