ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా "భరత్ అను నేను", "మహర్షి" ఇంకా  "సరిలేరు నీకెవ్వరూ" సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు . డైరెక్టర్ పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ని తొందరగా  ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కొంత పార్ట్ ని అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం యూఎస్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లోనే ఆ సీన్స్ ని కంప్లీట్ చేసేలా సెట్ వర్క్ చేసుకున్నారు.

అంతేకాదు, ఈ షెడ్యూల్ తర్వాత దుబాయ్ లో కూడా కొన్ని కీలకమైన సీన్స్ ని తీసేందుకు ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లో దుబాయ్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే హైదరాబాద్ లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసేయాలని చూస్తోందట మూవీ టీమ్. కీర్తి సురేష్ హీరోయన్ గా చేస్తున్న ఈ సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ ని హైదరాబాద్ లోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.దీనికి సంబంధించి సెట్స్ ని కూడా నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈసినిమాని 14రీల్స్ , మైత్రీ మూవీ మేకర్స్ , మహేష్ బాబు బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా పై సూపర్ స్టార్ అభిమానులు ఎన్నో భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు తిరగ రాయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: