ఇష్క్ సినిమా తో మళ్ళీ కమ్ బ్యాక్ చేసిన నితిన్ ఆ తర్వాత వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు.త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అఆ’ బ్లాక్‌బస్టర్ అయ్యాక వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చాయి అతణ్నుంచి. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు..  కీర్తి సురేష్ హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది.

కొత్తగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెట్టడంతో నితిన్ ఈసారైనా నిలకడ చూపిస్తాడని ఆశించారు అభిమానులు. కానీ వారికి మళ్లీ నిరాశ తప్పలేదు.నితిన్ నటించిన చెక్ సినిమా ఇటీవలే ప్రేకహకుల ముందుకు వచ్చింది.  వీకెండ్లోనే ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. తొలి రోజు వరల్డ్ వైడ్ 3.7 కోట్ల షేర్‌తో పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల్లో తేలిపోయింది. ఈ రెండు రోజుల షేర్ రూ.మూడున్నర కోట్లకు అటు ఇటుగా ఉండటం గమనార్హం. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటిదాకా రూ.7.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. నితిన్‌కు మంచి మార్కెట్ ఉన్న నైజాంలో రూ.2.4 కోట్ల షేర్ రాబట్టిన ‘చెక్’ మిగతా ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

‘ఉప్పెన’తో పోటీ, డివైడ్ టాక్ ఈ సినిమాను బాగానే దెబ్బ కొట్టినట్లుంది. ‘చెక్’ థియేట్రికల్ హక్కులు రూ.15.5 కోట్లకు అమ్మడం గమనార్హం. అందులో ఇప్పటిదాకా సగం కూడా వసూలు కాలేదు. వీకెండ్లోనే ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా.. ఇక వీక్ డేస్‌లో నిలబడటం అసాధ్యం.అని చెప్పొచ్చు.. ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు..  సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్..  

మరింత సమాచారం తెలుసుకోండి: