ప్రముఖ నటుడు, జర్నలిస్ట్ అయిన టీ ఎన్ ఆర్ గత సోమవారం ( మే - 10) కరోనా తో చివరి వరకు పోరాడి తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన అకాల మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంకా వీరే కాకుండా నాని, విజయ్ దేవరకొండ, మంచు విష్ణు తో పాటు పలువురు నటీనటులు సామాజిక మాధ్యమాల వేదిక గా సంతాపం వ్యక్తం చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నిన్న (మే 11) న  టీఎన్ఆర్ కుటుంబానికి తక్షణ ఖర్చుల కోసం లక్ష రూపాయలను సహాయం కింద అందజేశారు.

నిజానికి టీఎన్ఆర్ మెగాస్టార్ చిరంజీవి మీద ఉండే అభిమానం తోనే సినిమారంగానికి వచ్చినట్లు , ఆయన పలు సందర్భాలలో తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక సినిమా రంగానికి వచ్చిన తర్వాత తనదైన మార్గాన్ని ఎంచుకుని , ఆయన ఒక స్థాయికి ఎదిగారు. అంతలా టీఎన్ఆర్ మెగా స్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఇక టీఎన్ఆర్ మరణవార్త తెలుసుకున్న చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్య, పిల్లలకు ఫోన్ చేసి ఆయన పరామర్శించారు..

టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకుందని గుర్తుచేసుకున్నారు చిరంజీవి . జీవితంలో ఎంతో  పట్టుదలతో ఉన్న టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక టీఎన్ఆర్ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా, తాను అండగా నిలుస్తానని కూడా చిరంజీవి హామీ ఇచ్చారు.

ఇక చిరంజీవితో , టీ ఎన్ఆర్ భార్య ఏమన్నారంటే, మీకు ఆయన ఒక పెద్ద వీరాభిమాని సార్. తన 200 ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవ లేదు. మీరు ఇలా మాకు ఫోన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా కుటుంబానికి లక్ష రూపాయలనున్ తక్షణ ఖర్చులకోసం సహాయం అందజేసినందుకు మా కృతజ్ఞతలు అంటూ ఆమె తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: