కన్నడ హీరో యశ్ నటించిన 'కేజీఎఫ్' సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకన్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అటు హీరో,ఇటు దర్శకుడు ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత అగ్ర హీరోలు ఈ డైరెక్టర్ తో పని చేయడాననికి ముందుకొచ్చారు.కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తన ఫోకస్ ని మన టాలీవుడ్ స్టార్ హీరోలపై పెట్టాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ని రెండు డిఫరెంట్ రోల్స్ లో ప్రెజెంట్ చేయనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా వలన ఆగిపోయింది. ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత మరో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కన్నడ దర్శకుడు. ఈ విషయాన్ని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.అంతేకాదు ఇటీవలే ఎన్టీఆర్ కి ఓ స్టోరీ లైన్ ని కూడా వినిపించాడట ఈ దర్శకుడు. ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో మరో బాలీవుడ్ హీరో నటించనున్నాడట.ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో ఉంటే బాగుంటుందని..డైరెక్టర్ కి సూచించినట్లు తెలుస్తోంది.అయితే తన సినిమాలో బాలీవుడ్ హీరో నటిస్తే.. హిందీలో కూడా  తన క్రేజ్ పెంచుకోవచ్చని ఎన్టీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు ఇండ్రస్టీలో.మరి ఇండ్రస్టీ లో జోరుగా పవినిపిస్తున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సిందే.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం rrr సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: