బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. ఆమె బుల్లితెరపై కనిపిస్తే చాలు ఛానల్ మార్చకుండా ఆమె షో నీ పూర్తయ్యేంతవరకు చూస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. షో లు మాత్రమే కాకుండా ఆడియో ఫంక్షన్ లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ఉంటారు సుమ. వాటిని సైతం ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు తెలుగువారు. లేడీస్ షోల ద్వారా ఫేమస్ అయిన సుమ అంతకుముందు కొన్ని సినిమాల్లో కూడా నటించారు. సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాదు అప్పుడప్పుడు వెండితెరపై సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది.

ప్రస్తుతం తెలుగులో ఉన్న యాంకర్లలో నెంబర్ యాంకర్  సుమ కాగా ఆమె లైఫ్ ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ బిజీ అయిపోయింది. గ్యాప్ లేకుండా వరుస షోలు చేస్తూ భారీగా సంపాదిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సెకండ్ వేవ్ విజృంభించడంతో లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా నటీమణులు ఇంటికే పరిమితమయ్యారు. ఇండస్ట్రీలో చాలామంది పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సమ కూడా సినిమా వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందంటూ వీడియో విడుదల చేశారు.

ఇదిలా ఉంటే సుమ ఇంట్లో ఉంటూనే సంపాదించడం స్టార్ట్ చేసింది. ఎలా అంటే ఆమె పలు ప్రొడక్ట్ లకు ప్రమోట్ చేస్తూ వాటికి అంబాసిడర్ గా చేస్తోంది. తాజాగా సుమ ఇంస్టాగ్రామ్ లో వీడియో ని షేర్ చేసింది. ఇడ్లీ దినోత్సవం అంటూ ఈ మెసేజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని కోసం ఒక కంపెనీ వారు చేసిన స్పెషల్ ప్రొడక్ట్ లను ప్రమోట్ చేసింది సుమ. పుట్నాల పొడి కారం పొడి తనకు ఎంతో ఇష్టమైన చల్ల మిరపకాయలు పొడి ఈ కంపెనీ తయారు చేసే ప్రాజెక్టు లో ఉన్నాయని చెప్పి వారి ఉత్పత్తులను వివరిస్తూ ప్రమోట్ చేసింది. ఈ విధంగా సుమ లాక్ డౌన్ లో సంపాదిస్తూ సెన్సేషన్ గా మారుతుంది. మొత్తానికి ఇంట్లో ఉంటూనే ప్రమోషన్స్ తో డబ్బులు సంపాదిస్తున్న సుమని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: