తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒక్కరిగా రాణిస్తున్నారు. ఆయన ఒక్కప్పటి స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన రామానాయుడు చిన్న కొడుకు. అంతేకాదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నా సురేష్ బాబు తమ్ముడు. ఇక రామానాయుడు పెద్ద కొడుకు నిర్మాతగా రాణిస్తుండగా.. ఆయన చిన్న కొడుకు హీరోగా రాణిస్తున్నారు. వెంకటేష్ సినిమాల్లో తన నటనతో అలరిస్తాడు, కామెడీతో నవ్విస్తాడు, ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టిస్తారు. ఆయన ఎటువంటి పాత్రనైనా ఓన్ చేసుకుని అవలీలగా పండిస్తూ ఉంటాడు.

వెంకటేష్ తాజాగా నటించిన సినిమా నారప్ప. ఈ మూవీలో ఇతని నట విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు. ఇక ఇదిలా ఉండగా.. విక్టరీ వెంకటేష్ మొదటి సినిమా ఏది అని అడిగితే.. ఎవ్వరైనా సరే టక్కున చెప్పే పేరు ‘కలియుగ పాండవులు అని చెబుతుంటారు. కానీ అందరికి తెలియని మరో విషయం మరొక్కటి ఉంది. అదేంటంటే.. వెంకటేష్ కలియుగ పాండవులు సినిమా కంటే ముందే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

అయితే వెంకటేష్ ఇండస్ట్రీకి బాల నటుడిగా పరిచయమైయ్యారు. ఇక 1971వ సంవత్సరంలో రామానాయుడు నిర్మాణంలో ‘ప్రేమ్ నగర్’ అనే సినిమా వచ్చింది. అయితే అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలియదు. ఈ చిత్ర కోసం వెంకీ రూ.1000 పారితోషికం తీసుకున్నారంట. ఇక వెంకీ

అలా ‘ప్రేమ్ నగర్’ సినిమాతో ఇండస్ట్రీకి తెరంగేట్రం చేయడం జరిగింది. ఆ తరువాత రామానాయుడు వెంకటేష్ చదువు పాడవ్వకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ సినిమాల వైపుకి రానివ్వలేదు. ఇక అటు తర్వాత వెంకీ పై చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్నప్పుడు ‘కలియుగ పాండవులు’ చిత్రంలో నటించడానికి ఆయనని పిలిపించారు. ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: