గుణశేఖర్ డైరక్షన్ లో నీలిమ, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ లో నటిస్తుంది. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో సమంత నటించడంతో ప్రాజెక్ట్ కు సూపర్ క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ స్మాల్ స్క్రీన్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో సమంతతో పాటుగా స్మాల్ స్క్రీన్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే వర్షిణి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఢీ షో ద్వారా యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న వర్షిణి ఆ తర్వాత ఈటీవీలో చాలా షోస్ చేసింది. ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న కామెడీ షో కామెడీ స్టార్స్ ప్రోగ్రాం యాంకర్ గా అదరగొడుతుంది వర్షిణి. అంతకుముందు గ్లామర్ విషయంలో కొద్దిగా తడబడే అమ్మడు ఇప్పుడు స్కిన్ షోకి ఏమాత్రం మొహమాట పడట్లేదు. స్మాల్ స్క్రీన్ పై ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న వర్షిణి సిల్వర్ స్క్రీన్ మీద తన సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న శాకుంతలం సినిమాలో లక్కీ ఛాన్స్ పట్టేసింది వర్షిణి.

సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ చాలా ఎక్సయిట్ అవుతుంది వర్షిణి. ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని భావిస్తుంది. సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల వర్షిణి తెగ మురిసిపోతుంది. శాకుంతలం సినిమాలో తప్పకుండా సమంతతో పాటుగా తను కూడా ప్రేక్షకుల మనసు గెలిచేస్తా అంటుంది వర్షిణి. అమ్మడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే వర్షిణి తప్పకుండా శాకుంతలం సినిమాతో అలరించడం పక్కా అని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటుగా సుమంత్ నటిస్తున్న సినిమాలో కూడా వర్షిణి నటిస్తుందని తెలుస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై కూడా మళ్లీ వర్షిణికి అవకాశాలు వస్తున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: