టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్
రాజీవ్ కనకాల తాజాగా తన వ్యక్తిగత జీవితం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. యాంకర్
సుమ భర్త గా,
ఎన్టీఆర్ స్నేహితుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు ఎన్నో సినిమాల్లో తన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవలే
వెంకటేష్ హీరో గా చేసిన నారాప్ప
సినిమా లో కీలక మైన పాత్ర పోషించిన
రాజీవ్ కనకాల ఈ
సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. తెలుగు
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్ లు ఉన్న
సుమ కి ఉండే డిమాండ్, క్రేజ్ వేరు.
50 కి దగ్గర పడుతున్న ఇంకా నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ. ఎంతో మంది యంగ్ యాంకర్స్ వచ్చి తమ అందాలు ఆరబోస్తున్న ఆమె టాలెంట్ ముందు ఏ మాత్రం పనికి రావడం లేదు. అలాంటిది ఆమె తన
భర్త రాజీవ్ కనకాల తో రెండు సంవత్సరాల కింద విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. దీనిపై
రాజీవ్ కనకాల ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అన్న విషయం పై క్లారిటీ ఇచ్చాడు. 2018 వరకు అందరం కలిసే ఉన్నామని అదే సమయంలో మా అమ్మ చనిపోవడంతో
నాన్న ఒక్కడే తన సొంత ఇంట్లో ఉండి పోయాడు.
ఆ సమయంలో
నాన్న దేవదాస్ కనకాల కోసం తను కూడా కుటుంబాన్ని వీడి విడిగా ఉండవలసి వచ్చింది అని చెప్పాడు. తను ఉంటున్న ఫ్లాట్ కి
నాన్న ను తీసుకొద్దాం అనుకుంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉంది. అది ఇంట్లో పట్టకపోవడంతో నాన్నతో పాటు అక్కడే ఉండిపోయాను అని అన్నాడు. దాంతో నేను
సుమ విడిపోయాము అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అని చెప్పాడు ఈ సీనియర్ నటుడు. ప్రస్తుతం మేము అందరం కలిసే ఉంటున్నామని చెప్పాడు. ఏదేమైనా సోషల్
మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు కొంచెం కూడా ప్రైవసీ లేకుండా పోయింది. మంచి విషయాన్ని కూడా చెడుగా చూపిస్తున్నారు.