ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు హీరో రామ్. ఇటు దర్శకుడు పూరి జగన్నాథ్ కి కూడా ఇస్మార్ట్ శంకర్ ఎంతో జోష్ నీ ఇచ్చింది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఈ ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఇద్దరు చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పని చేసుకున్నారు. లేదంటే వారి కెరియర్ లు ప్రమాదం లో పడి ఉండేవి అని చెప్పవచ్చు. ఆ విధంగా వీరు తమ తదుపరి చిత్రాలకు వెళ్లారు.  పూరీ ఓ స్టార్ హీరో తో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు.

రామ్ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రెడ్ సినిమా చేయగా అది ప్రేక్షకులను కొంతవరకు మెప్పించినా ఇస్మార్ట్ శంకర్ సినిమా స్థాయికి మాత్రం అది చేరుకోలేదని చెప్పాలి.  అలా ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో రామ్ నటిస్తున్నాడు. ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండగా ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలలో ఇది ఒకటి.


ఇక ఈ సినిమాలో కృతి శెట్టి మొదటి హీరోయిన్ గా కాగా మరో హీరోయిన్ గా నటిస్తుంది అక్షర గౌడ.  తెలుగులో మన్మధుడు2 సినిమాలో నటించిన ఈమె ఆ సినిమా విజయం సొంతం చేసుకోకపోయినా అందాల పరంగా ప్రేక్షకుల వద్ద ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. అయితే రామ్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. గత కొన్ని సినిమాలుగా మనం గమనిస్తే రామ్ ఇద్దరు హీరోయిన్లను తన ప్రతి సినిమా లో మెయింటైన్ చేయడం చూస్తున్నాం. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో, మొన్న వచ్చిన రెడ్ సినిమా లో  ఇద్దరు ఉన్నారు.  ఇప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నాడు రామ్. చూస్తుంటే మినిమం ఇద్దరు హీరోయిన్లు లేనిదే రామ్ సినిమాలు చేయను అని చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: