తొలి సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి ఏ డెబ్యూ హీరోకి దక్కని
బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ఆయన మొదటి
సినిమా ఈ రేంజ్ లో హిట్ అయిందంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకోవడమే కాకుండా నటుడిగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్. ఇక
హీరోయిన్ కృతి అయితే ఈ సినిమాతోనే స్టార్
హీరోయిన్ గా మారిపోయింది.
అలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తన తదుపరి చిత్రం గా
టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు గా ఉన్న క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే
సినిమా చేశాడు. ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రోజే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. టైలర్ తోనే ఈ
సినిమా గొప్ప విప్లవాత్మక
సినిమా అని తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె ఈ చిత్రంలో గొర్రెల కాపరి గా నటిస్తుంది.
ఈ
సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ
సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ ముదిరి పోయాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దానికి కారణం ఆయన కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వకపోవడమేనట. తన మూడవ
సినిమా కాకుండా ఆ తర్వాత చేసే సినిమాల కోసం కథలు వింటున్న
వైష్ణవ్ తేజ్ కొత్త దర్శకులతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలోనే ఆయన పెద్ద దర్శకులతో మాత్రమే పని చేయాలని చూస్తున్నారట. అలా వారితో మాత్రమే సినిమాలు చేసే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఈ పరిణామాలు చూస్తుంటే వైష్ణవ్ అప్పుడే బాగా ముదిరిపోయాక అని చెప్పవచ్చు.