టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా లో హీరో గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కొన్ని రోజుల పాటు కరోనా వల్ల ఈ సినిమాసినిమా షూటింగ్ వాయిదా పడినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంస్థలు సంయుక్తం గా నిర్మిస్తున్నాయి, ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, రమ్య కృష్ణ ప్రధాన పాత్ర లో కనిపించబోతోంది, అలాగే ఈ సినిమా లో మరో ప్రత్యేకమైన పాత్రలో మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు ఇలా అనేక కారణాల వల్ల జనాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి, అయితే తాజా గా ఈ సినిమా కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 ఈ సినిమా లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్ర లో కనిపించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి, అప్పట్లో ఒక సారి బాలకృష్ణ కూడా లేజర్ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి లైగర్ చిత్ర యూనిట్ ను కలిసి వచ్చారు. మరి లైగర్ సినిమా లో  బాలకృష్ణ నటిస్తున్నాడా అనే విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు, అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: