చిత్ర పరిశ్రమలో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ కాలేకపోయినా వారసులు ఎంతోమంది ఉన్నారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇదే లిస్ట్ లో సీనియర్ హీరో రాజశేఖర్ కూతుళ్లు కూడా ఉన్నారు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక 'దొరసాని' సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ప్లాప్ ని మూటగట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత శివాత్మిక పలు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఎందుకనో ఇప్పటివరకు అవి విడుదల కాలేదు. మరోవైపు రాజశేఖర్ పెద్ద కూతురు శివాని కి కెరీర్ ఆరంభంలోనే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.

ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ నటించిన 'టూ స్టేట్స్'  సినిమా ఆరంభంలోనే ఆగిపోయింది.ఇక చివరికి తేజ సజ్జా నటించిన 'అద్భుతం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అలాగే ఈమె రెండో చిత్రంగా వస్తున్నా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' సినిమాకి కూడా క్రేజ్ అంతంతమాత్రంగానే ఉంది. అలా టాలీవుడ్ లో సత్తా చాటలేక పోయిన ఈ అక్క చెల్లెల్లు ఇప్పుడు కొత్తగా రూట్ మార్చి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇక శివాత్మిక తమిళంలో హీరోయిన్గా పరిచయం అవుతున్న 'ఆనందం విలయాడుం వీడు'  సినిమా ఈ డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచే ఈ సినిమాలో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటించాడు. అలాగే అటు శివాని సైతం 'అన్బరివు' అనే సినిమాతో తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా జనవరి 7వ తేదీన హాట్ స్టార్ లో విడుదల కానుంది. ప్రముఖ విలక్షణ నటుడు సాయి కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మరి ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమిళంలో తమ మొదటి చిత్రాలతో విజయం సాధిస్తే కచ్చితంగా అక్కడ హీరోయిన్స్ గా మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: