దీంతో ఏ ఇండస్ట్రీలో చూసిన ఐశ్వర్య ధనుష్ విడాకులకు సంబంధించిన వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోతుంది. అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల విడాకులతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ చెప్పిన ధనుష్ ఐశ్వర్య ఇద్దరు కూడా ప్రస్తుతం వారి వారి పనిలో మునిగి పోయి మళ్లీ బిజీ బిజీగా మారిపోయారు అని అర్థమవుతుంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇటీవలే ఐశ్వర్య ధనుష్ ఒకేచోట కు చేరుకున్నారు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ధనుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక షూటింగ్ నిమిత్తం ఇటీవలే హైదరాబాదుకు వచ్చాడట ధనుష్.
అదే సమయంలో అటు ఐశ్వర్య రజనీకాంత్ కూడా ఒక లవ్ సాంగ్ షూటింగ్ లో బిజీగా మారిపోయారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ లవ్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక ఈ సాంగ్ షూటింగ్ లో ప్రస్తుతం ఐశ్వర్య బిజీగా ఉండగా ఈ షూటింగులో భాగంగా ఐశ్వర్య కూడా హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఐశ్వర్య ధనుష్ ఇద్దరూ కూడా ఒకే హోటల్ లో ఉంటున్నట్లు సమాచారం. రామోజీరావు స్టూడియో లోని సితారా హోటల్లో ధనుష్ ఐశ్వర్య బస చేస్తున్నారట. దీంతో విడాకుల తర్వాత మళ్లీ ఐశ్వర్య ధనుష్ కలుసుకున్నారు అంటూ వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్.