కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల వ్యవహారం ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 18 ఏళ్ల నుంచి ఎంతో కలిసిమెలిసి ఉన్న ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి అన్నది మాత్రం ప్రస్తుతం అభిమానులందరికీ కూడా ఒక చిక్కు వీడని ప్రశ్న గా మారిపోయింది అని చెప్పాలి. 2004 లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఇక వీరు విడాకులు తీసుకుంటున్నారు ప్రకటించిన తర్వాత ఐశ్వర్య ధనుష్ మరికొన్ని రోజుల్లో మళ్లీ కలవబోతున్నారు అంటూ ధనుష్ తండ్రి కస్తూరి రాజ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారిపోయాయ్.



 దీంతో ఏ ఇండస్ట్రీలో చూసిన ఐశ్వర్య ధనుష్ విడాకులకు సంబంధించిన వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోతుంది. అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల విడాకులతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ చెప్పిన ధనుష్ ఐశ్వర్య ఇద్దరు కూడా ప్రస్తుతం వారి వారి పనిలో మునిగి పోయి మళ్లీ బిజీ బిజీగా మారిపోయారు అని అర్థమవుతుంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇటీవలే ఐశ్వర్య ధనుష్ ఒకేచోట కు చేరుకున్నారు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ధనుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక షూటింగ్ నిమిత్తం ఇటీవలే హైదరాబాదుకు వచ్చాడట ధనుష్.


 అదే సమయంలో అటు ఐశ్వర్య రజనీకాంత్ కూడా ఒక లవ్ సాంగ్ షూటింగ్ లో బిజీగా మారిపోయారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ లవ్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక ఈ సాంగ్ షూటింగ్ లో ప్రస్తుతం ఐశ్వర్య బిజీగా ఉండగా ఈ షూటింగులో భాగంగా ఐశ్వర్య కూడా హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఐశ్వర్య ధనుష్ ఇద్దరూ కూడా ఒకే హోటల్ లో ఉంటున్నట్లు సమాచారం.  రామోజీరావు స్టూడియో లోని సితారా హోటల్లో ధనుష్ ఐశ్వర్య బస చేస్తున్నారట. దీంతో విడాకుల తర్వాత మళ్లీ ఐశ్వర్య ధనుష్ కలుసుకున్నారు అంటూ వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: