ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పెద్ద సినిమాలు షూటింగ్ లో అపేసుకున్నాయి. చిన్న సినిమాలకు ఎలాంటి దోకా కాలేకపోయినా కూడా పెద్ద సినిమాలు భారీ స్థాయిలో టెక్నీషియన్స్ తో కూడుకున్న పని కాబట్టి ఈ సినిమాలు ఈ పరిస్థితులలో షూటింగ్ లు చేయడం మంచిది కాదని భావించి వాటిని పోస్ట్ ఫోన్ చేశారు. అలా పెండింగ్ లో ఉన్న పెద్ద సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. 

తొలిసారిగా పవన్ కు చారిత్రాత్మక సినిమాలో నటించడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుని ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టకపోవడం పవన్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది అని చెప్పాలి. మరొకవైపు ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మళ్లీ మొదలవుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తొందరగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వాలని చెబుతున్నారు ఆయన అభిమానులు. 

ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కూడా మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయడం లేదు. మహేష్ బాబు కాలికి శస్త్రచికిత్స కావడంతో ఆగిపోయిన ఈ షూటింగ్ మళ్ళీ మొదలు కాకపోవడంతో ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారు అన్న ఒత్తిడి నుంచి రోజురోజుకు ఎక్కువైపోతుంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల అవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు ప్రేక్షకులలో ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు అందరు పెద్ద హీరోలు తమ సినిమాల షూటింగ్ లను త్వరత్వరగా పూర్తి చేస్తుంటే ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఈ సినిమాల విషయంలో మెల్లగా వెళ్లడం వారి అభిమానులను నిరుత్సాహపరుస్తుంది అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: