మోస్ట్ అవైయిటెడ్ మూవీ గా రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబడుతోంది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి అందరికి.. ఇక ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం పోషించారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించిన అప్పటి నుంచి ఏదో ఒక వాయిదా పడుతూ వస్తోంది.. అయితే ఈసారి మార్చి 11వ తేదీన థియేటర్లు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్రబృందం.. అయితే తాజాగా ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా.. తాజాగా ఒక అప్ డేట్ ను విడుదల చేయడం జరిగింది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.


కొద్ది నిమిషాల క్రితమే రాధే శ్యామ్ మూవీ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది చిత్రబృందం. ఇక ఈ రోజున ప్రేమికుల దినోత్సవ సందర్భంగా గ్లింప్స్ విడుదల కావడంతో బాగా వైరల్ గా మారుతోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాలో తెరకెక్కించడం జరిగింది. ఇక యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రశీద , ప్రమోద్ నిర్మించారు. ఇక ఈ సినిమా సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెల 11వ తేదీన విడుదల కానుంది.


ఇక ఈ సినిమా గ్లింప్స్ విషయానికొస్తే.. పూజా హెగ్డే వాయిస్ డైలాగుతో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రిచ్ నేస్ కలిగి ఉంది. ఇక ప్రభాస్ పూజ హెగ్డే ఇందులో ఒక ఒక విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక అంతేకాకుండా ప్రభాస్ ఎవరికో ప్రపోజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చివరిగా పూజా హెగ్డే నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు అనే డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. ఈ వాలెంటైన్స్ డేట్ కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రభాస్ అభిమానులకు లభించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: